పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన

పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడే.. జనసేనాని ముందే మాజీ ఎమ్మెల్యే ప్రకటన

Pulaparthi Ramanjaneyulu joined Janasena : భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజినేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పులపర్తి రామాంజినేయులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీచేస్తారని ప్రకటించారు. ఈ వీడీయో క్లిప్‌ను జనసైనికులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే పవన్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రధానాంశాలు:

  • పవన్ కళ్యాణ్ పోటీ అక్కడి నుంచే
  • మాజీ ఎమ్మెల్యే పులపర్తి కీలక వ్యాఖ్యలు
  • జనసేన గూటికి చేరిన రామాంజినేయులు

Pulaparthi Ramanjaneyulu joined Janasena : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఓ వైపు పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ జనసైనికులకు మాత్రం కొంచెం నిరాశలో ఉన్నారనే అనుకోవచ్చు. పొత్తులో భాగంగా ఓ వైపు సీట్లు తగ్గుతున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయం తనకు వదిలేయండి అనీ చెప్తున్నారు. అధికారంలోకి వచ్చేది మనమే అంటున్నారు. పోనీలే ఆ సంగతి వదిలేద్దామని అనుకున్నా కూడా.. అధినేత ఎక్కడ పోటీచేస్తారనే విషయంలో మాత్రం జనసైనికులు ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. ఓ రోజు కాకినాడ, మరోరోజు భీమవరం.. ఇంకో రోజు ఇంకో ప్లేసు ఇలా రోజుకో మాట వినబడుతోంది. అలాగే ఎంపీ అని ఒకసారి.. లేదు, లేదు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని మరోసారి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీచేస్తారనే విషయాన్ని జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు.

భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం జనసేనలో చేరారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. పులపర్తి జనసేనలో చేరటంతో అందరూ ఆయనకే టికెట్ అని భావించారు. అయితే జనసేనలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ పులపర్తి రామాంజినేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణే భీమవరం నుంచి పోటీచేస్తారని చెప్పారు. దీంతో ఆడిటోరియం మొత్తం విజిల్స్ , కేకలతో దద్దరిల్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

“భారతదేశంలోనే బలమైన ప్రధాని నరేంద్ర మోదీ. మన రాష్ట్రంలో మోదీ ఎవరి మాటనైనా వింటారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాట మాత్రమే. భీమవరంలో నాకు సీటు ఇచ్చారని అనుకుంటున్నారేమో.. కాదు. కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. 2029లో ఆయనను ముఖ్యమంత్రిని చేయాలి. పవన్ కళ్యాణ్ కోసం మనందరం కష్టపడాలి” అని పులపర్తి రామాంజినేయులు ప్రకటించారు. అయితే రామాంజినేయులు చేసిన ఈ వ్యాఖ్యలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తు్న్నారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం పక్కానని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు.. పులపర్తి రామాంజనేయులు 2009లో భీమవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసిన ఆ ఎన్నిక్లలో గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. పవన్ రెండోస్థానంలో నిలవగా.. పులపర్తి రామాంజినేయులు మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వార్తలు