‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ

‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ

Kurnool Jail Girl Tragedy Incident కర్నూలుకు చెందిన ఓ మహిళను పోలీసులు చోరీ కేసులో రిమాండ్‌పై మహిళా సబ్‌ జైలుకు తరలించారు. తల్లి ఏం తప్పు చేసిందో.. ఎందుకు జైలుకు వెళ్లిందో ఆలోచించే వయసు కూడా తెలియక బాలిక జైలు దగ్గరకు వచ్చారు. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు గేటు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయారు. ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి.. ఈ వీడియో వైరల్ అవుతోంది.

కర్నూలులో హృదయవిదారక దృశ్యం కనిపించింది. జైలు గోడలు తల్లీబిడ్డల బంధాన్ని దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ ఏడేళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో కనిపించింది. అమ్మను చూడాలని, అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. జైలు లోపల ఉన్న తల్లి కోసం.. ఆ జైలు ముందే అమ్మా.. అమ్మా.. అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు ఆవేదన కలిగిస్తోంది. కర్నూలులో జరిగిన ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేసింది.

కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట ఈ సన్నివేశం కనిపించింది. ఓల్డ్ సిటీకి చెందిన చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుబడగా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు.. కానీ తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం ఏంటో కూడా ఆలోచించే వయస్సు కూడా కాదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని కలిచివేసింది.

అమ్మ కోసం జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది. స్థానికులు కొంత మంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా.. మానవతాదృక్పథంతో జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించారు.. కూతురిని కలిసేలా చూశారు. ఆ తర్వాత జైలు అధికారులు కుమార్తెను బంధువులకు అప్పగించారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు