8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..

8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..

నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క సీటూ కూడా గెలవలేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చి గోదావరి, ప్రకాశం జిల్లాలో ఒక్క సీట్ ను కూడా గెలవలేక పోయింది వైస్సార్సీపీ.

ఏపీ లోని అనేకమంది వైసీపీ ముఖ్య నేతలు సైతం ఓడిపోయారు. ఇక రాష్ట్రంలో ఓడిపోయిన కీలక నేతలు వివరాలు ఒకసారి చూస్తే..

  • ఆర్కే రోజా (వైసీపీ) – నగరి
  • బుగ్గన రాజేంద్రనాథ్‌ (వైసీపీ) – డోన్‌
  • చెల్లుబోయిన వేణుగోపాల్‌ (వైసీపీ) – రాజమండ్రి రూరల్‌
  • వంగా గీత (వైసీపీ) – పిఠాపురం
  • అంజాద్‌ బాషా (వైసీపీ) – కడప
  • ఆళ్ల నాని (వైసీపీ) – ఏలూరు
  • కొడాలి నాని (వైసీపీ) – గుడివాడ
  • మార్గాని భరత్‌ (వైసీపీ) – రాజమండ్రి సిటీ
  • అంబటి రాంబాబు (వైసీపీ) – సత్తెనపల్లి
  • కారుమూరి నాగేశ్వర రావు (వైసీపీ) – తణుకు
  • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ) – మాచర్ల
  • బొత్స సత్యనారాయణ (వైసీపీ) – చీపురుపల్లి
  • తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైసీపీ) – రాప్తాడు
  • కొట్టు సత్యనారాయణ (వైసీపీ) – తాడేపల్లిగూడెం
  • రవీంద్రనాథ్‌ (వైసీపీ) – కమలాపురం
  • తానేటి వనిత (వైసీపీ) – గోపాలపురం
  • జక్కంపూడి రాజా (వైసీపీ) – రాజానగరం
  • కోన రఘపతి (వైసీపీ) – బాపట్ల
  • వల్లభనేని వంశీ (వైసీపీ) – గన్నవరం
  • గుడివాడ అమర్‌నాథ్‌ (వైసీపీ) – గాజువాక
Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు