డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సీదెళ్ల ఫణికుమార్‌(43), ఆయన తల్లి సీదెళ్ల కరుణ(62) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Please follow and like us:
క్రైమ్ వార్తలు