టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి

టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్‌ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి

చిత్తూరు జిల్లా కేపీ బండలో విషాదం

టీడీపీ నాయ­కు­డి­కి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం… వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్‌ జాన్‌ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్‌కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు