పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్స్‌ క్లబ్‌లో పేకాట ఆడిస్తానంటూ సంచల

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్‌లో పేకాట ఆడిస్తాననని.. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని వ్యాఖ్యానించారు. అనంతపురం మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా క్లబ్బులు మూతపడ్డాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానన్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.. పేకాట వంటి జూదాన్ని ప్రోహత్సహిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ తెలుగు దేశం పార్టీ నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెలయే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కాదని వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇలా మాట్లాడటంపై దుమారం రేగింది. మరి ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రసాద్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

మరోవైపు అనంతపురం జిల్లా గార్లదిన్నెలోని ఓ వ్యవసాయ తోటలో పేకాట స్థావరం గుట్టురట్టు చేశారు పోలీసులు. గార్లదిన్నె సమీపంలో వ్యవసాయ తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో గార్లదిన్నె, శింగనమల పోలీసులు దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి రూ.4,11,700 నగదు, 20 బైక్‌లు, 9 మొబైల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన
గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌. ఉరవకొండ మండలం నింబగల్లు, వజ్రకరూరు మండలం కొనకొండ్ల దగ్గర ఎస్‌ఎస్‌ ట్యాంకులను మంత్రి పరిశీలించారు. ఉరవకొండలో తీవ్ర తాగునీటి సమస్యను ఎన్నికల ముందు నుంచి గమనించానని.. వారంలో రోజుల్లో నీటి సరఫరాను మెరుగు పరిచే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి అవసరాలకు సంబంధించి బకాయిలు రూ.150 కోట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి కేశవ్ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షించారు. పట్టణానికి రోజుకు కనీసం 15 లక్షల లీటర్ల నీటిని తరలించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. త్వరలోనే నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. అలాగే నియోజకవర్గంంలో సమస్యల పరిష్కారానికి తనవంతుగా ప్రయత్నం చేస్తానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు