శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.2,58,56,737 కోట్ల నగదు ఆదాయంగా లభించిందని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.2,58,56,737 కోట్ల నగదు ఆదాయంగా లభించిందని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు 379 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 8 కేజీల 30 గ్రాములు లభించగా, నగదు బంగారుతో పాటు 1093 యూఏఈ దిర్హమ్స్, 21 యుఎస్ఏ డాలర్లు, 215 మలేషియా రింగిట్స్, 10 మౌరీటియస్ రూపాయలు, కెనడా డాలర్లు 20 యుకే పౌండ్సు, మాల్దీవ్స్ రుఫీయాస్ 10,ఈరోస్ 102- సింగపూర్ డాలర్లు, 25 ఈ హుండీ లెక్కింపులో లభించాయని ఆలయ ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు