ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు

ఏపీ రైలు ప్రయాణిికులకు ముఖ్యమైన గమనిక.. ఈ రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని రద్దు

రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదగా

ప్రధానాంశాలు:
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక
పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వేశాఖ
రెండు రైళ్లను రద్దు చేసిన అధికారులు

ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. నాగపూర్‌ డివిజన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్‌ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్నం-హజ్రత్‌ నిజాముద్ధీన్‌ (12807/12808 ) రైలు ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో దారి మళ్లించారు. ఎర్నాకుళం-బిలాస్‌పూర్‌ (22815/22816) రైలు ఆగస్టు 12, 14 తేదీల్లో, ఎల్‌టీటీ ముంబై-విశాఖపట్నం (22847/22848) రైలు ఆగస్టు 18,20 తేదీల్లో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ (12771/12772) ఆగస్టు 7, 8, 14, 15 తేదీల్లో.. నాందెడ్‌-సంత్రాగచి (12767/12768) ఆగస్టు 12,14 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని నియమించారు. మూడేళ్ల పాటూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. 2014-2019 మధ్య తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీగా రామకృష్ణారెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్లాన్ చేయగా.. 2019 తర్వాత అడుగులు పడలేదు.. అయితే రామకృష్ణారెడ్డి 2021 మే 31న ఎండీ పదవికి రాజీనామా చేశారు.

రామకృష్ణారెడ్డి సేవల్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి ఎండీగా నియమించింది. ఆయనకు రవాణా, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల్లో పనిచేసి అనేక ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడంతో.. ఆయన అనుభవం మెట్రో రైలు ప్రాజెక్టుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రోకు సంబంధించి ఎండీగా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న జేఎం రావును ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. గతంలోనే రామకృష్ణారెడ్డి విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు నివేదికల తయారీ, వాటిని కేంద్ర పరిశీలనకు పంపడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రాజెక్టులు దాదాపుగా పట్టాలెక్కే సమయంలో ప్రభుత్వం మారింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. మరి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందో చూడాలి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు