తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం, కళింగపట్నం, విశాఖపట్నం, పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతుంది. పారాదీప్ (ఒడిశా)కి 260 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 290 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కిమీ దూరంలో కేంద్రీకృతం అయింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా – ధమ్రా (ఒడిశా) సమీపంలో తీ రం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతం అయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి దిగువన ఇచ్చిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది…

భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి. వాటి కింద ఉండకండి.
వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి.
పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు