అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు

రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్ ‘ లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‎లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎస్. ఇప్పటికే, అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్‎లో నడుస్తున్న క్యాంటీన్‎ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు.

రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్‎ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు. క్యాంటీన్‎ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ను సి.ఎస్ ఆదేశించారు. ఇక క్యాంటీన్ సర్వీస్‌ల ఏర్పాటుపై సచివాలయంలో సమీక్షా సమావేశానికి రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు