రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్‌ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. నాసిరకం మెటీరియల్‌తో పనులు చేశారని చెప్పారు. స్కూల్స్ పునరుద్ధరణ పేరుతో భారీ దోపిడీ జరిగిందని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు